కరోనా భయంతో భవనంపై నుంచి దూకిన వృద్ధుడు!
రాజస్థాన్లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా భయంలో గజగజ వణికిపోతున్నారు. ఈ నేఫథ్యంలో తనకు కరోనా వైరస్ వచ్చిందేమోనన్న భయంతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
జైపూర్కు చెందిన కైలాష్ అనే 78 ఏళ్ల వృద్ధుడు కరోనా భయంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడి కుటుంబసభ్యులు మాత్రం ఆస్పత్రిలో వసతులు సక్రమంగా లేకపోవడంతో ఆయన కలత చెందారని చెబుతున్నారు. రాత్రంతా నిద్రపోకుండా తెల్లవారే సరికి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని వాపోయారు. కాగా, కైలాష్ మృతి చెందిన అనంతరం అతనికి కరోనా నెగెటివ్గా రిపోర్టు వచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com