coronavirus : తమిళనాడుకు ఊరట కలిగించే విషయం ఇదే..

coronavirus : తమిళనాడుకు ఊరట కలిగించే విషయం ఇదే..

తమిళనాడులో కరోనా మహమ్మారి ఏ మాత్రం శాంతించడం లేదు. రోజూ వేలాది కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 3756 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఊరట కలిగించే విషయం ఏమిటంటే అంతే స్థాయిలో రికవరీలు నమోహవుతున్నాయి. బుధవారం కొత్తగా 3051 మంది కోలుకున్నారు.

అలాగే కొత్తగా మరో 6 కరోనావైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయని తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పుడు 1,22,350 ధృవీకరించబడిన కేసులు ఉన్నాయి, వీటిలో 74,167 రికవరీలు ఉండగా.. 46,480 క్రియాశీల కేసులు, 1700 మరణాలు ఉన్నాయి. ఇదిలావుంటే విద్యుత్ శాఖ మంత్రి, ఎఐఎడిఎంకె నాయకుడు పి తంగమణికి కరోనావైరస్ పాజిటివ్ తేలినట్టు పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story