మంత్రికి కరోనా.. మరోసారి పరీక్షలకు సిద్ధమవుతున్న తమిళనాడు సీఎం!

మంత్రికి కరోనా.. మరోసారి పరీక్షలకు సిద్ధమవుతున్న తమిళనాడు సీఎం!

ఇటీవలే కరోనా పరీక్షలు చేపించుకొన్న తమిళనాడు సీఎం పళనిస్వామి.. మరోసారి టెస్టులు చేపించుకోవాడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సీఎంతో కలిసి కరోనా పాజిటివ్ ఉన్న ఓ మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొనటమే దీనికి కారణం. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆ మంత్రికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు జరిపిన తరువాత ఆ మంత్రి.. సీఎంలో కలిసి చైన్నైలో సచివాలయంలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తరువాత కరోనా పరీక్ష ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సీఎం పళనిస్వామి ఆ మంత్రికి ఫోన్ చేసి.. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు.. సీఎంకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని.. కరోనా నిర్థారణ పరీక్షలు చేపించుకోవాలని చూచించారు. దీంతో సీఎం పళనిస్వామి కరోనా పరీక్షలుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. కాగా, వారం రోజుల క్రితం ఆయన కరోనా పరీక్షలు చేపించుకోగా.. ఆయనకు నెగెటివ్ అని వచ్చిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story