వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై అఖిలేష్ యాదవ్ ట్వీట్

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై అఖిలేష్ యాదవ్ ట్వీట్

యూపీలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ రాజకీయ చర్చకు తెరలేపుతోంది. దూబే ఎన్‌కౌంటర్ పై ట్వీట్ చేసిన సమాజ్ వాద్ పార్టీ అఖిలేశ్ యాదవ్.. వాస్తవానికి దూబే కారు బోల్తా పడలేదని.. ప్రభుత్వం పడిపోకుండా బయటపడిందని అన్నారు. పోలీసులపై కాల్పులు జరిపి పరారైన దూబే కోసం గాలింపు చర్యలు పట్టి.. గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, శుక్రవారం ఉదయం ఆయన వెళ్తున్న పోలీసు వాహనం బోల్తా పడటంతో.. ఆయన అక్కడ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ఆయనను ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అఖిలేష్ యాదవ్.. ‘‘ వాస్తవానికి కారు బోల్తా పడలేదు. రహస్యాలు బయటికి వచ్చి యూపీ ప్రభుత్వం పడిపోకుండా బయటపడింది..’’ అని అన్నారు. కాగా వికాస్ దూబేను నిజంగా అరెస్ట్ చేశారో లేక తనంత

తాను లొంగిపోయాడో చెప్పాలంటూ అఖిలేశ్ యాదవ్ నిన్న డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అతడితో ఎవరు కుమ్మక్కయ్యారో బయటపడేలా కాల్ రికార్డులన్నీ బహిర్గతం చేయాలని ఆయన కోరారు.

Tags

Read MoreRead Less
Next Story