ఏపీలో కరోనా పంజా.. భారీగా పాజిటివ్ కేసులు నమోదు
By - TV5 Telugu |10 July 2020 3:47 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1576 మందికి కరోనా సోకింది. మిగతా 32 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,194 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 11,936 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 15 కరోనా మరణాలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 292కి చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com