భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజ‌ృంభణ.. ఒక్కరోజులో 26,506 కేసులు

భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజ‌ృంభణ.. ఒక్కరోజులో 26,506 కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతీ రోజు 25వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 26,506 కేసులు నమోదవ్వగా.. 475 మంది మృతి చెందారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 7,93,802కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 21.604కు చేరింది. కాగా.. ఇప్పటి వరకూ 4,95,512 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 2,76,685 చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story