ఎన్కౌంటర్.. నలుగురు నక్సల్స్ మృతి
By - TV5 Telugu |10 July 2020 12:53 PM GMT
బీహార్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లా బాగహా ప్రాంతంలో సశస్త్ర సీమాబల్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని పోలీసులు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com