సినిమాకు బీమా చేయించుకోనున్న నిర్మాత

కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నిరుద్యోగం పెరిగింది. దీని ప్రభావం సినమారంగం పై కూడా పడింది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. అయితే, ఈ నేపథ్యంలో తాప్సి ప్రధానపాత్రలో నటించిన లూప్ లపేటా చిత్రం బీమా చేయించుకునేందుకు సిద్దమైంది. చిత్ర నిర్మాత అతుల్ కస్బేకర్.. కరోనా కారణంగా నష్టాలు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేపట్టారు. న్యాయనిపుణులతో కలిసి చర్చలు జరిపారు. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.. ఇదే బాటలో మరింత మంది నడిచే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story