మరో మంత్రికి కరోనా పాజిటివ్
By - TV5 Telugu |10 July 2020 9:15 PM GMT
తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. తాజాగా మరో రాష్ట్రమంత్రికి కరోనా సోకింది. సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు రెండు రోజుల కిందట కరోనా పరీక్షలు చేయగా.. శుక్రవారం రోజున వెలువడిన ఫలితాల్లో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అలాగే ఆయన కుటుంబసభ్యులు కూడా క్వారంటైన్ కు వెళ్లినట్టు సమాచారం. మంత్రి రాజు కరోనా భారిన పడ్డారని తెలుసుకున్న డీఎంకే అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడారు, ఈ సందర్బంగా మంత్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com