భారత మాజీ క్రికెటర్కు కరోనా పాజిటివ్
By - TV5 Telugu |12 July 2020 11:09 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామన్యుల నుంచి సినీ రాజకీయ, క్రీడ ప్రముఖుల వరకు ఎవరినీ ఈ మహమ్మారి విడిచిపెట్టడం లేదు. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ఆటగాడికి కరోనా సోకింది. భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఇటీవల ఆయనలో కోవిడ్ -19 లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలో కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో చేతన్ చౌహాన్ 'ఎస్జీపీజీఐ' కి చెందిన కోవిడ్ హాస్పిటల్లో చేరినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com