తూత్తుకుడి లాకప్ డెత్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమతి

తూత్తుకుడి లాకప్ డెత్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమతి

తమిళనాడులో కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా జయరాజ్, ఆయన కుమారుడు జే బెనిక్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే. అయితే, తరువాత వారిద్దరూ చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, తాజాగా ఇదే విషయంపై ఐక్యరాజ్య సంస్థ ప్రతినిథులు దీనిపై స్పంధించారు. ఈ కేసు దర్యాప్తు సంపూర్ణంగా, నిస్పక్షపాతంగా జరగాలని యూఎన్ఓ సెక్రటరీ జనరల్‌కు అధికార ప్రతినిథి స్టెఫానే డుజరిక్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలకరుల సమావేశంలో ఈ మేరకు స్పందించారు.

తమిళనాడులో జయరాజ్ సతుంకుళం మెయిన్ బజార్ ఏరియాలో ఓ దుకణం నడుపుతున్నారు. అయితే, జూన్ 19న కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు జయరాజ్ ను స్టేషన్ ను తీసుకొని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న జయరాజ్ కుమారుడు జే బినిక్స్ స్టేషన్ కు వెళ్లాడు. దీంతో ఇద్దర్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తరువాత.. గాయపడిన వీరిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారని.. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారని కేసు నమోదైంది. ముందుగా ఈ కేసును సీబీసీఐడీ దర్యాప్తు చేయగా.. తరువాత, సీబీఐకి అప్పగించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు పోలీసులను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ ఘటనపై విలేకర్ల అడిగిన ప్రశ్నలకు యూఎన్ఓ సెక్రటరీ జనరల్‌కు అధికార ప్రతినిథి స్టెఫానే డుజరిక్ ఈవిధంగా స్పందించారు.

Tags

Read MoreRead Less
Next Story