కర్నాటక-ఏపీ మధ్య నిలిచిపోనున్న బస్సులు

కర్నాటక-ఏపీ మధ్య నిలిచిపోనున్న బస్సులు

కర్నాటకలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలసిందే. అయితే, దీని ప్రభావం ఏపీ, కర్నాటక అంతర్రాష్ట్ర బస్ సర్వీసులపై పడింది. జూలై 15 నుంచి 23వరకూ ఇరు రాష్ట్రాల మధ్య మొత్తం 120 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కరోనా ప్రభావంతో రెండు రాష్ట్రాల మధ్య కొంత విరామం తరువాత ఇటీవలే బస్సు సర్వీసులు మొదలైయ్యాయి. కానీ, అనూహ్యంగా బెంగళూరులో లాక్ డౌన్ విధించడంతో మరోసారి బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Tags

Read MoreRead Less
Next Story