బాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత

బాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత

బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ఐశ్వర్యరాయ్‌, రణదీప్ హుడా జంటగా నటించిన సరబ్జిత్‌ చిత్రంలో నటించిన రాజన్‌ సెహగల్‌(36) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్‌ సెహగల్ ఆదివారం చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పలు టీవీ సీరియల్ లలో కూడా నటించారు. క్రైమ్‌ పెట్రోల్‌, తుమ్‌ దేనా సాత్ మేరా, సావధాన్‌ ఇండియా.. వంటి కార్యక్రమాల్లో కూడా కనిపించారు. సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) దివంగత నటుడికి ట్విట్టర్‌లో నివాళి అర్పించింది. కాగా, 2010 నుంచి రాజన్‌ సీఐఎన్‌టీఏఏ సభ్యునిగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story