కరోనాతో టీడీపీ నేత మృతి
కరోనా కాటుకు టీడీపీ నేత ఒకరు బలి అయ్యారు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రసిద్ధి గాంచిన పి.టి రంగరాజన్ కు ఇటీవల కరోనా వ్యాధి సోకింది. దాంతో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఆదివారం మరణించారు. రంగరాజన్ మృతికి
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర యాదవ్ సంతాపం తెలిపారు.
గత కొన్నేళ్లుగా పార్టీలో ఉంటూ సహాయసహకారాలు అందిస్తున్న రంగరాజన్ ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. రంగరాజన్ రాజకీయాలతో పాటు వ్యాపార రంగాల్లో రాణించారని టీడీపీ నేతలు అన్నారు. కాగా ఏపీలో ఇవాళ రికార్డు స్థాయిలో కేసులు వచ్చాయి. మొత్తం 17,624 నమూనాలను పరీక్షించగా 1,914 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com