ఏపీలో ఒక్కరోజే కరోనాతో 43 మంది మృతి

ఏపీలో ఒక్కరోజే కరోనాతో 43 మంది మృతి

ఏపీలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1908 కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ర్టవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 33019కి చేరింది. ఇందులో 15144 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారి నుండి 17467 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 408కి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story