దేశంలో ఒక్కరోజే 553 మంది మృతి
By - TV5 Telugu |14 July 2020 11:49 AM GMT
దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 553 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9,06,752కు చేరింది. ప్రస్తుతం 3,11,565 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 5,71,460 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23,727కు చేరింది. భారత్లో కరోనా రికవరీ రేటు 63.02శాతానికి పెరిగింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com