తమిళనాడు సీఎంకు కరోనా నెగిటివ్
By - TV5 Telugu |14 July 2020 2:01 PM GMT
తమిళనాడు సీఎం పళనీస్వామికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చింది. ఇటీవల కరోనా సోకిన మంత్రి.. సీఎంతో కలిసి సమావేశంలో పాల్గోవడంతో.. పళనిస్వామికి పరీక్షలు జరిపారు. సీఎంతో పాటు.. ఆయన కార్యలయంలోని మొత్తం సిబ్భందికి కూడా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. అయితే, ఈ పరీక్షల్లో అందరికీ కరోనా నెగిటివ్ అని తేలింది. కరోనా కట్టడికి తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,42,798 కేసులు నమోదయ్యాయి. 2,032మంది కరోనాతో మృతిచెందారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com