ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన డొక్కా
By - TV5 Telugu |14 July 2020 3:59 PM GMT
ఇటీవల వైసీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్ మంగళవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరయ్యారు. కాగా టీడీపీనుంచి వైసీపీలో చేరిన మాణిక్య వరప్రసాద్ ఆ సమయంలో టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్న డొక్కా వైసీపీలో చేరి మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యారు. అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టిన సమయంలో మొదట్లో వారికి మద్దతు తెలిపిన ఆయన.. ఆ తరువాత వ్యూహాత్మకంగా వైసీపీకి దగ్గరయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com