బిగ్ బ్రేకింగ్ : డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్ పైలట్ తొలగింపు
By - TV5 Telugu |14 July 2020 3:40 PM GMT
రాజస్థాన్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ కు షాక్ ఇచ్చింది. ఆయనను డిప్యూటీ సీఎం పదవినుంచి తొలగించింది.
వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి హాజరుకాకపోవడంతో పార్టీకి వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ భావించింది.
దాంతో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను తొలగించింది. అంతేకాదు ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను కూడా తప్పించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో ఏర్పడిన వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నించినప్పటికీ పైలట్ మొండివైఖరి వీడలేదు. దాంతో ఆయనపై చర్య తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com