బీహార్లో జూలై 16 నుంచి 31 వరకు సంపూర్ణ లాక్ డౌన్
By - TV5 Telugu |14 July 2020 6:45 PM GMT
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి జూలై 16 నుంచి 31 వరకు బీహార్లో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మంగళవారం ప్రకటించారు. మున్సిపల్, జిల్లా, సబ్ డివిజనల్ మరియు బ్లాక్ హెడ్ క్వార్టర్స్ స్థాయిలో 15 రోజుల లాక్డౌన్ అమలులో ఉంటుందని, మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నామని మోడీ తన అధికారిక ట్విట్టర్ లో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కరోనాకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ లేదని.. అందువల్లే లాక్ డౌన్ తప్పదని మోడీ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com