విశాఖ దుర్ఘటనలో మృతుడి కుటుంబానికి రూ. కోటి చెల్లించాలి : చంద్రబాబు

విశాఖ దుర్ఘటనలో మృతుడి కుటుంబానికి రూ. కోటి చెల్లించాలి : చంద్రబాబు

విశాఖ దుర్ఘటనలో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన ప్యాకేజి.. రాంకీ సాల్వెణ్ట్ బాధితులకు ఇవ్వాలన్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులను నిర్బంధించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇక విశాఖలో వరుస ప్రమాదాలు జరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

పాలకుల బాధ్యతారాహిత్యమే విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని అన్నారు. పారిశ్రామిక భద్రతను పెను ప్రమాదంలో పడేశారని వరుస ప్రమాదాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారని అన్నారు. విశాఖ కంపెనీలో విస్ఫోటనలపై ఎందుకు ఇంత నిర్లక్షమని, బాధ్యతారాహిత్యానికి హద్దూ అదుపు లేదా అంటూ ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన వారిని వదిలేసి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వారిని అరెస్ట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story