కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌..

కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌..

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ రాజమణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్‌కు కరోనా సోకినట్లు బుధవారం జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

కరోనా నియంత్రణ నేపథ్యంలో కలెక్టర్‌ కంటైన్మెంట్‌ జోన్లలో పర్యటించారని జిల్లా వైద్యాధికారి రామదురై మురుగన్‌ తెలిపారు. కలెక్టర్‌లో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని చెప్పారు. సోమవారం ఉదయం నుంచి కలెక్టర్‌ జ్వరంతో బాధపడుతుండగా మంగళవారం ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వివరించారు.

కాగా, తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1,47,324కు చేరింది. ప్రస్తుతం 47,915 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 2,099 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story