గణనీయంగా కరోనా రికవరీ రేటు
By - TV5 Telugu |15 July 2020 2:35 PM GMT
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా నమోదవుతున్నాయి. బుధవారం సుమారు 30 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, రికవరీ రేటు కూడ ఎక్కవగా నమోదవుతుంది. మహమ్మారి కొన్నిరాష్ట్రాలకే పరిమితమైందని కేంద్ర ప్రభుత్వం తెలపింది. మే3న 26.59 శాతం రికవరీ రేటు ఉండగా..ఇప్పుడు 63.02శాతంగా ఉందని తెలిపింది. 20రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాలలో రికవరీ రేటు చాలా మెరుగ్గా ఉందని అన్నారు. 86 శాతం యాక్టివ్ కేసులు సంఖ్య 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని.. కొత్త కేసుల్లో వృద్ధిరేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మార్చిలో కేసుల్లో వృద్ధిరేటు 31శాతం ఉండగ.. మేలో 9శాతానికి తగ్గిందని.. జూలై నాటికి 4శాతంలోపే వృద్ధి రేటు ఉందని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com