ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త వెల్లడించింది. లాక్డౌన్ కాలంలో రిజర్వేషన్ చేసుకొని గడువులోగా టికెట్ రద్దు చేసుకోలేని వారికి మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం టికెట్ కాన్సిలేషన్ పాలసీలో మార్పులు చేసింది. రిజర్వేషన్ టికెట్లకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లని చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య రిజర్వేషన్
చేసుకున్న వారికి సైతం అవకాశం కల్పించింది. లాక్డౌన్ కారణంగా చాలామంది తమ టికెట్లను నిర్ణీత సమయం లోపు రద్దు చేసుకోలేక పోవడంతో.. వారికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా నిబంధనల్ని మార్చివేసింది. దీని ప్రకారం ఈనెల 29 లోపు ప్రయాణికులు వారి టికెట్లను రద్దు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. దగ్గర్లోని బస్టాండు లేదా ఎటీబీ కౌంటర్లో టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com