యూపీలో మరోసారి కాల్పుల కలకలం.. గాయపడ్డ ఎస్ఐ
By - TV5 Telugu |15 July 2020 9:12 AM GMT
ఉత్తరప్రదేశ్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలీసులపై రౌడీ మూక కాల్పులు జరిపింది. ఇటీవల గ్యాంగ్స్టర్ వికాస్దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్సీ సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన మరువక ముందే యూపీలో పోలీసులపై కాల్పులు జరగటం కలకలం సృష్టిస్తోంది.
మంగళవారం రాత్రి బడౌన్లోని కురౌ బైపాస్వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రౌడీ మూక కాల్పులు జరిపింది. దీంతో ఓ సబ్ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. అటు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ రౌడీ గాయపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నామని బడౌన్ ఎస్పీ అశోక్ కుమార్ త్రిపాఠీ ప్రకటించారు. తప్పించుకున్నవారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com