యూపీలో మరోసారి కాల్పుల కలకలం.. గాయపడ్డ ఎస్‌ఐ

యూపీలో మరోసారి కాల్పుల కలకలం.. గాయపడ్డ ఎస్‌ఐ

ఉత్తరప్రదేశ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలీసులపై రౌడీ మూక కాల్పులు జరిపింది. ఇటీవల గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్సీ సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన మరువక ముందే యూపీలో పోలీసులపై కాల్పులు జరగటం కలకలం సృష్టిస్తోంది.

మంగళవారం రాత్రి బడౌన్‌లోని కురౌ బైపాస్‌వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రౌడీ మూక కాల్పులు జరిపింది. దీంతో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. అటు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ రౌడీ గాయపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నామని బడౌన్‌ ఎస్పీ అశోక్‌ కుమార్‌ త్రిపాఠీ ప్రకటించారు. తప్పించుకున్నవారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story