రేపటి నుంచి ప్రముఖ ఆలయం మూసివేత..

రేపటి నుంచి ప్రముఖ ఆలయం మూసివేత..

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని బుధవారం నుంచి మూసివేయనున్నారు. వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయానికి చెందిన అయిదుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతితో దర్శనాలు నిలిపివేయాలని ఆలయ ఈవో నిర్ణయించారు. అయితే స్వామి వారి నిత్య కైంకర్యాలు యథాతథంగా కొనసాగుతాయని ఈవో వెల్లడించారు. జిల్లాలో కరోనా పెరుగుతుండడం అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో ఆందోలన కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 3074 కాగా, 29 మంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story