పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు జరిపిస్తాం: ఉత్తమ్కుమార్ రెడ్డి
By - TV5 Telugu |16 July 2020 10:36 AM GMT
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని ప్రకటించారు. ఇటీవలే పీవీ కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్రావు, పీవీ మనోహర్రావు, వాణీదేవిలతో సమావేశం అయ్యామని, ఉత్సవ కమిటీ చీఫ్ ప్యాట్రన్గా ఉండేందుకు మనోహర్ రావు అంగీకరించారని తెలిపారు. ఉత్సవాలు ఏడాది పాటు జరుగుతాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇటీవల పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com