ఏపీని కాపాడండి.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

ఏపీని కాపాడండి.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని లేఖలో వివరించారు. ఈ రెండు బిల్లులను శాసనమండలి తిరస్కరించిదని.. ఈ బిల్లులను కౌన్సిల్ సెలక్ట్ కమిటికీ సూచించిందని అన్నారు. రాజధాని తరలింపు వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. ప్రజా ప్రయోజనా దృష్యా సరైన చర్యలు తీసుకోవాలని.. ఏపీని కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story