తెలంగాణలో 25న ఇంటర్ రీకౌంటింగ్ ఫలితాలు
By - TV5 Telugu |19 July 2020 10:00 AM GMT
తెలంగాణలో ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు జులై 25న విడుదలచేసే అవకాశాలు ఉన్నాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఫెయిలైన విద్యార్థులు పాసైనట్టుగా ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను ఇంటర్బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. వారంతా కంపార్టుమెంట్లో పాసైనట్టుగా తెలియజేస్తారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com