పదినిమిషాల పాత్ర చేస్తే దానికి అవార్డా.. సిగ్గులేదు: కంగన

పదినిమిషాల పాత్ర చేస్తే దానికి అవార్డా.. సిగ్గులేదు: కంగన

ఎవరేమనుకుంటే నాకేంటి.. ఉన్న విషయం మాట్లాడితే తప్పేంటి.. అంటూ ఏవిషయం పైన అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువ. వారసులే స్టార్ హీరోలు.. మరెవరికీ ఇక్కడ అవకాశాలు ఉండవు అని కంగన గొంతు విప్పింది. ఆమెతో మరి కొందరు ఆ రోజు నుంచి ఇదే విషయంపై ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు. కంగనా రనౌత్ కి మరోనటి ఆలియా భట్ అంటే అస్సలు పడదు.. సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శిస్తూనే ఉంటుంది.

తాజాగా మరోసారి ఆలియాపై విరుచుకుపడింది కంగన. బాలీవుడ్ లో అవార్డుల నామినేషన్ల ఎంపిక ప్రక్రియ ప్రతిభ ఆధారంగా జరగదని ఆరోపించింది. ఆలియా కంటే దీపిక పదుకొణె బెటర్ అంటుంది. హ్యాపీ న్యూయిర్ సినిమాకి గాను అవార్డు వస్తే.. దాన్ని తీసుకోకుండా 'క్వీన్' సినిమాలో కంగన నటన బాగుందని అందరి ముందూ అంగీకరించి అవార్డును తిరస్కరించింది. ఆమెకే ఈ అవార్డు ఇవ్వడం సముచితంగా ఉంటుందని వేదిక మీద వెల్లడించింది.

కానీ ఆలియా భట్ మాత్రం గల్లీబాయ్ లో 10 నిమిషాలు నటించి అవార్డు తీసుకుంది.. అందుకు ఆమె కొంచెం కూడా సిగ్గుపడలేదు అని కంగన తెలిపింది. ఇక సుశాంత్ ఎదగకుండా బాలీవుడ్ మాఫియా ఎంత చేయాలో అంత చేసింది. అతడు నటించిన డైవ్ సినిమాను నిర్మించిన కరణ్ జోహార్ కు ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేసే సామర్థ్యం లేదంటే నమ్మను అని కంగన చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story