రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదు: లోకేష్

రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదు: లోకేష్

వైఎస్ జగన్ గ్యాంగ్ కు ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఏపీలో మహనీయుల విగ్రహాల తొలగింపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్లలో అంబేద్కర్ విగ్రహం, కావలిలో నందమూరి తారక రామారావు విగ్రహం తొలగించారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 90 కేసులున్న క్రిమినల్ కి కాంస్య విగ్రహం పెడతామని మంత్రి ప్రకటించడంతోనే.. రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థం అవుతోందని అన్నారు. జగన్ గ్యాంగ్ కి తలకెక్కిన అధికార మదాన్ని ప్రజలే దించుతారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story