తమిళనాడు ప్రజాప్రతినిధుల్లో కరోనా కలకలం

తమిళనాడులో ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా మరోముగ్గురు ఎమ్మెల్యులకు మహమ్మారి సోకింది. ముగ్గురూ డిఎమ్‌కే ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. వెల్లూరు ఎమ్మెల్యే కార్తీకేయన్, కృష్ణగిరి ఎమ్మెల్యే టీ సెంగుట్టవన్, రాణీ పేట్ ఎమ్మెల్యే ఆర్ గాంధీ కరోనా పాజిటివ్‌గా ఇటీవల జరిగిన పరీక్షల్లో తేలింది. తాజాగా నమోదైన ఎమ్మెల్యేలతో కలిపి డీఎమ్‌కేలో మొత్తం కరోనా పాజిటివ్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరుకుంది. అటు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా 9 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story