ప్రభుత్వం నిద్రపోతుందా?: తెలంగాణ హైకోర్టు

ప్రభుత్వం నిద్రపోతుందా?: తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడింది. కోర్టు ఆదేశాలు పాటించని ఆదేశాలు పాటించని వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. న్యాయస్థానం తీర్పులను ఒక్కసారి కూడా అమలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వివరాలు అధికారులు సరిగా చూపించడంలేదని అన్నారు. బెడ్లు, వెంటిలేటర్లు వివరాలు ఎందుకు తెలియజేయటం లేదని ప్రశ్నించింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే కరోనా పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణ బాగా వెనకబడిందని

న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే.. ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడింది. కరోనా వివరాలు తెలుసుకోవడం ప్రజల ప్రాధమిక హక్కని అని.. వివరాలు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story