వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్!
By - TV5 Telugu |22 July 2020 4:43 PM GMT
ఏపీలో కరోనా విస్ఫోటనం చెందుతున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా భారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోనులోనే వైద్యులను సంప్రదిస్తూ సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు అంబటి రాంబాబను కలిసిన వారి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. కుటుంబ సభ్యులకు, తనను కలిసిన కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. కాగా గత రాత్రి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. తాను క్వారంటైన్ కు వెళుతున్నట్టు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com