స్పెయిన్ ని మించిపోయిన భారత్..!!
By - TV5 Telugu |22 July 2020 12:43 PM GMT
దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా కోలుకునే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరగడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11,92,915 కాగా వీరిలో 1,53,050 మంది కోలుకున్నారు. మృతి చెందిన వారు 28,732మంది. మరో 4,11,133 కేసులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 37,724 కేసులు నమోదయ్యాయి. 648 మరణాలు సంభవించాయి. తాజా సమాచారం ప్రకారం కొవిడ్ మరణాల జాబితాలో భారత్ 7వ స్థానానికి చేరుకుంది. 28,400 మరణాలతో స్పెయిన్ 8వ స్థానంలో ఉంది. అయితే కొవిడ్ కేసుల్లో మాత్రం భారత్ మూడో స్థానంలో ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com