90 మంది ట్రైనీ పోలీసులకు కరోనా

90 మంది ట్రైనీ పోలీసులకు కరోనా

ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న 90 మంది పోలీసులకు కరోనా సోకింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కి ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. దీంతో ట్రైనింగ్ సెంటర్ లోని అందరికీ పరీక్ష చేశారు. వారిలో 90 మందికి పైగా కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ సెంటర్లో 400 మందికి పైగా పోలీసులు శిక్షణ పొందుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్ లో గుర్తించిన మరో 150 మందిని క్వారంటైన్ కి పంపారు. అనంతరం ట్రైనింగ్ స్కూల్ ను అధికారులు శానిటైజ్ చేశారు. కాగా, బెంగళూరు వ్యాప్తంగా ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. అందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story