సంచలనం రేపుతున్న రఘురామకృష్ణంరాజు నిర్ణయం

సంచలనం రేపుతున్న రఘురామకృష్ణంరాజు నిర్ణయం

ఎంపీ రఘురామకృష్ణంరాజు తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది పనులు ప్రారంభం అయినా వాటికి సీఎం కానీ, జిల్లా పరిదిలో జరిగే వాటికి మంత్రులు కానీ హాజరవుతారు. కానీ, ఎంపీ రఘురామకృష్ణం రాజు.. నర్సాపురం నియోజకవర్గంలో జరగనున్న పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆహ్వానం పంపారు. నర్సాపూర్‌ అసెంబ్లీ పరిధిలోని మైనపువాని లంక గ్రామాన్ని నిర్మలా సీతారామన్‌ ఇటీవల దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామానికి నిర్మలా సీతారామన్ 4 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈ నిధులతో పలు భవనాలు నిర్మించారు. వాటి ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. అక్టోబర్ నెలలో ఒక రోజు నియోజకవర్గంలో పర్యటించాలని కేంద్రమంత్రిని రఘురామకృష్ణరాజు కోరారు. అంతేకాదు విపత్తు నిర్వహణ నిధుల నుంచి కోతకు గురవుతున్న తీర ప్రాంతంలో రివిట్‌మెంట్‌ పనులకు రు. 200 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story