పార్టీ ఎమ్మెల్యేకు మరోసారి ఆదేశాలు జారీ చేసిన మాయావతి

పార్టీ ఎమ్మెల్యేకు మరోసారి ఆదేశాలు జారీ చేసిన మాయావతి

రాజస్థాన్‌లోని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మాయావతి పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. గెహ్లాట్ ప్రభుత్వం బల పరీక్షకు దిగితే.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేస్తే.. వారు అనర్హతకు గురవుతారిని హెచ్చరించారు.

బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడంపై ఇప్పటికే తాము ఆశ్రయించామని ఆమె గుర్తు చేశారు. సీఎం గెహ్లోత్‌కు తగిన గుణపాఠం చెప్పడానికి సమయం కోసం వేచిచూస్తున్నామని ఆమె తెలిపారు. ఇప్పుడు మరోసారి కోర్టుకెక్కాలని నిర్ణయించుకున్నామని, ఈ విషయాన్ని తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీం కోర్టుకైనా వెళ్తామని ఆమె ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story