మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కలకలం

మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కలకలం

మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఇటీవల కాలంలో తగ్గుముఖం పడుతుంది. అయితే, మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 138మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. అటు, ముగ్గులు పోలీసులు కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ 8722 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా సోకగా.. 6670 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 150 మంది అధికారులతో పాటు 1,213 మంది పోలీసులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. ఇప్పటివరకూ మహారాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన 97 మంది మ‌ృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story