మూడు రాష్ట్రాల ఎన్నికల కోసమే భూమి పూజ చేస్తున్నారు: శివసేన

మూడు రాష్ట్రాల ఎన్నికల కోసమే భూమి పూజ చేస్తున్నారు: శివసేన

అయోధ్యలో రామమందిర నిర్మాణ విషయంలో బీజేపీ వ్యవహారాన్ని శివసేన తప్పపట్టింది. రామమందిర నిర్మాణాన్ని రాజకీయ లబ్దికోసం బీజేపీ వాడుకుంటుందని శివసేన అధికారికి పత్రిక సామ్నా ఆరోపించింది. యూపీ, బీహార్, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని.. దీని కోసమే, రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేపడుతున్నారని దుయ్యబట్టింది. ఓ వైపు దేశంలో కరోనా విజృంభిస్తుంటే.. ఎన్నికల మూడు రాష్ట్రాల ఎన్నికల కోసం ఇలా భూమి పూజ నిర్వహించడం సరికాదని మండిపడింది. యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక, రామమందిర నిర్మాణం చేపట్టడంతో పాటు, మరోవైపు అభివృద్ధి పనులతో హడావిడి చేస్తున్నారని శివసేన ఆరోపించింది. కాగా.. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు 200 మందినే అనుమతిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story