తెలంగాణ ఒక్కరోజే 1,811 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ ఒక్కరోజే 1,811 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో బుధవారం 1,811 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 521 పాజిటివ్‌లు ఉన్నాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేరింది. అలాగే కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 505 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా అత్యధికంగా రంగారెడ్డిలో 289, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 151, వరంగల్‌లో 102, నల్లగొండలో 61 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే 18,263 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 4,16,202 మంది కరోనా పరీక్షలు జరిపారు.

Read MoreRead Less
Next Story