మెట్రో సేషన్లకు మాజీ సీఎంల పేర్లు
By - TV5 Telugu |31 July 2020 3:35 PM GMT
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని మూడు మెట్రో స్టేషన్లకు మాజీ సీఎంల పేర్లును పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీఎన్ అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలితల పేర్లును పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. మాజీ సీఎంల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం పళనిస్వామి తెలిపారు. అలందూర్ మెట్రోస్టేషన్కు అరిజ్ఞార్ అన్నా అలందూర్ మెట్రో, సెంట్రల్ మెట్రో స్టేషేన్కు పురచ్చితలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ మెట్రో, సీఎంబీటీ మెట్రో స్టేషన్కు పురచ్చితలైవి డాక్టర్ జె జయలలిత సీఎంబీటీ మెట్రోగా పేర్లు మార్పు చేశారు. ఇకపై అధికారికంగా ఇవే పేర్లుతో పిలుస్తారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com