మధ్యప్రదేశ్‌లో 588మందికి పోలీసులుకు కరోనా

మధ్యప్రదేశ్‌లో 588మందికి పోలీసులుకు కరోనా

కరోనా పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న పోలీసులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. మధ్యప్రదేశ్ లో పోలీసులు కరోనా బారినపడుతున్నారు. రాష్ట్రంలో 588 మందిపోలీసులు కరోనా బారినపడ్డారని హోం మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. దీంతో 2000 మంది పోలీసులను క్వారంటైన్ కు తరలిచామని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 2వేల మంది పోలీసులకు సెలవులు మంజూరు చేసి క్వారంటైన్ లో పెట్టామని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందనే భయంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అత్యవసర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నా.. పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని హోం మంత్రి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story