'మహా' పోలీస్ శాఖలో కరోనా కలకలం.. కొత్తగా 184మందికి పాజిటివ్

మహా పోలీస్ శాఖలో కరోనా కలకలం.. కొత్తగా 184మందికి పాజిటివ్

కరోనా మహమ్మారి అన్ని వర్గాల వారిపై విరుచుకుపడుతుంది. ముఖ్యంగా కరోనా వారియర్స్‌ ఎక్కువుగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతుంది. ప్రతీ రోజు వందలమంది పోలీసులు కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 187 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. అటు, ఇద్దరు పోలీసులు కరోనాతో మృతి చెందారు. మొత్తం 10,614 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా సోకగా.. 8,604 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 1,896 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ఇప్పటివరకూ 114 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story