ఎల్బీనగర్ ఎమ్మెల్యేకు కరోనా..
By - TV5 Telugu |8 Aug 2020 5:12 PM GMT
తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా భారిన పడగా.. తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, పనిమనిషికి కూడా కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో వారందరిని సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంచారు. ఇదిలావుంటే రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతులు 615కి పెరిగారు. ఇప్పటి వరకు 54,330 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.. ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com