డర్టీ పిక్చర్ చిత్రంలో నటిస్తానంటే అందరూ.. : విద్యా బాలన్

డర్టీ పిక్చర్ చిత్రంలో నటిస్తానంటే అందరూ.. : విద్యా బాలన్

పిచ్చి ఏమైనా పట్టిందా అలాంటి చెత్త సినిమా చేస్తున్నావు అని అన్న వాళ్ల నోళ్లు మూయించింది విద్యా బాలన్ డర్టీ పిక్చర్ లో నటించింది. పైగా అలా అన్న వాళ్లే ఎంత బాగా యాక్ట్ చేశావు అని మెచ్చుకుని ప్రశంసల వర్షం కురిపించారు. ఆ చిత్రంలోని నటనకు గాను విద్యకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రంలో నటించమని చిత్ర యూనిట్ అడిగినప్పుడు నటించాలా వద్దా అని పలు సందేహాలు. ఆ మీమాంసతో పలువురు సన్నిహితులను సంప్రదించగా.. అలాంటి చిత్రాలు చేయవద్దని సలహా ఇచ్చారు.

చిత్ర పరిశ్రమకు సంబంధంలేని తల్లిదండ్రులను అడిగితే వాళ్లు నీకు మంచిది అనిపిస్తే చెయ్యమని చెప్పారు. అప్పుడు నాకు నేను ఆలోచించుకుని డర్టీ పిక్చర్ లో నటించాను అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు విద్యాబాలన్. దర్శకుడు మిలాన్ నా మీద విశ్వాసం ఉంచి ఆ పాత్రను నాకిచ్చారు. ఆయన కళను ఆరాధించే దర్శకుడు.. చెత్తగా అయితే తీయరు అని నాకనిపించింది. పైగా నిర్మాత ఏక్తా కపూర్. ఆమె కూడా ఒక మహిళ. ఆమెతోనే నేను నా కెరీర్ ను ప్రారంభించారు.

ఆ రకంగా చూసుకుంటే నేను భద్రంగానే ఉంటానని అనుకున్నాను. కానీ కొందరు అన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి అని చెప్పారు విద్య. 2011లో విడుదలైన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, తుషార్ కపూర్, నసీరుద్దీన్ షా వంటి నటులు కీలక పాత్ర పోషించారు. కాగా అనుమీనన్ దర్శకత్వం వహించిన గణిత మేథావి శకుంతలా దేవి చిత్రంలో విద్య టైటిల్ రోల్ పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story