విదేశీ జమాత్ సభ్యులకు జరిమానా

విదేశీ జమాత్ సభ్యులకు జరిమానా

కరోనా నిబంధనలను ఉల్లంఘించి తబ్లీగ్ జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీయులకు కోర్టు జరీమానా విధించింది. మార్చిలో ఢిల్లీలోని జరిగిన సమావేశాలకు హాజరైన కిర్గిస్థాన్, ఇండోనేషియా కు చెందిన తబ్లీగ్ జమాత్ సభ్యులకు జరిమానా విధించింది. మొత్తం 24 మందికి జరిమానా పడింది. 12 మంది కిర్గిస్థాన్ దేశానికి చెందిన పౌరులకు ఒక్కోక్కరికి రూ.6వేల చొప్పున జరిమానాను భోపాల్ కోర్టు విధించింది. మరో 12 మంది ఇండోనేషియా వాసులకు రూ.7వేలు చొప్పున జరిమానా విధిస్తూ మరో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చిలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశాలకు పలు దేశాల నుంచి వచ్చిన సభ్యులు వీసా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారిందరికీ పాస్ పోర్టులను సీజ్ చేయాలని, వీసాలు రద్దు చేయాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

Tags

Read MoreRead Less
Next Story