పుదుచ్చేరిలో కొత్తగా 481 కరోనా కేసులు
By - TV5 Telugu |12 Aug 2020 9:22 PM GMT
పుదుచ్చేరిలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 481 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో ఐదుగురు మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో పుదుచ్చేరిలో కరోనా బాధితుల సంఖ్య 6,381కి చేరింది. అయితే, ప్రస్తుతం 2,616కేసులు యాక్టివ్ లో ఉండగా.. 96 మంది ఇప్పటివరకూ మరణించారు. యాక్టివ్ కేసుల్లో 1,093మంది హోం ఐసోలేషన్లో ఉండగా, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, కరోనా ఇటీవల విజృంభించడంతో మరిన్ని కఠిన చర్యలుతీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com