శబ్థ కాలుష్య నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు

శబ్థ కాలుష్య నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు

శబ్ధ కాలుష్యాన్ని అరికట్టేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కఠిన చర్యలు తీసుకుంటుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదనలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విడుదల చేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ గార్గ్ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఛైర్ పర్సన్ ఆదర్శ్ కుమార్ గోయెల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే.. జరిమానాలను దేశవ్యాప్తంగా అమలు చేయగానికి చట్టబద్దమైన ఉత్తర్వులను జారీ చేయాలని ఎన్జీటీ కోరింది. శబ్ద కాలుష్య నిబంధనలను పాటించకపోతే లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.10వేలు జరిమానా విధించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించింది. 1000 కేవీఏ కంటే ఎక్కువ సామర్థ్యం కల డీజిల్ జనరేటర్ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యానికి లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. నిర్మాణ ప్రదేశాల్లో అనుమతికి మించి చేస్తే రూ.50వేలు జరిమానా విధించనున్నారు. నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబెల్స్, రాత్రివేళలో 45 డెసిబెల్స్ శబ్దం స్థాయిని దాటితే చర్యలు తప్పవని హెచ్చిరించింది. పారిశ్రామిక వాడల్లో పగటిపూట 75 డీబీ, రాత్రి వేళ 70 డీబీ వరకు మాత్రమే అనుమతిచ్చారు. నివాసప్రాంతాల్లో పటాకులు పేల్చిన వ్యక్తికి వెయ్యిరూపాయలు, సైలెన్స్ జోన్ లో పటాకులు పేలిస్తే మూడువేలరూపాయల జరిమానా విధించవచ్చు. బహిరంగ ర్యాలీలో పటాకులు పేలిస్తే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జరిమానా విధించనున్నారు. శబ్దకాలుష్య ఉల్లంఘనలు పునరావృతమైతే జరిమానాలు రెట్టింపు విధించనున్నారు. ప్రస్థుతం వివాహాలు, ఈవెంట్స్, రెస్టోబార్ లలో రాత్రి 11 గంటలకు మించి లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు.

Tags

Read MoreRead Less
Next Story