నవ్వులు పూయించిన అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్
By - TV5 Telugu |13 Aug 2020 10:19 PM GMT
రాజస్థాన్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చాలా రోజుల తరువాత సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ కలుసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. కరచాలనం చేసుకొని నవులు పూయించారు. అయితే, సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం.. పరోక్షంగా సచిన్ పైలట్ కు చురకలంటించారు. జరిగిందంతా మరిచిపోండి.. ఏదీ గుర్తుపెట్టుకోవద్దు అని అన్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడతామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు. 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు సపోర్టు లేకుండానే తాను మెజారిటీని నిరూపించుకోగలనని అన్నారు. అయితే, అది తనకు సంతోషాన్నివ్వదని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com